నాగర్ కర్నూల్ పట్టణంలోని రూ.40 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

నాగర్ కర్నూల్  పట్టణంలోని రూ.40 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న టీచర్  పర్వీన్ కు ఈ నెల 22న స్నేహితుల ఫోన్​ నుంచి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని వాట్సాప్​లో మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె ఆన్​లైన్ లో రూ.40 వేలు పంపించింది.

కొద్ది సేపటి తరువాత మరో రూ.20 వేలు కావాలని మెసేజ్  రాగా, అనుమానంతో స్నేహితురాలికి ఫోన్  చేయగా ఫోన్  హ్యాక్  అయిందని చెప్పడంతో షాక్​కు గురైంది. సైబర్  నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి వెంటనే డయల్  1098 ద్వారా ఫిర్యాదు చేసింది. సోమవారం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కంప్లైంట్​చేయగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.