గుజరాత్ లోని ఓ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. దాహోద్ -ఆనంద్ రైలు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు నడుస్తుండగానే మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును ఆపేశారు. ఆ వెంటనే ప్రయాణకులంతా దిగిపోయారు.
గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా నుంచి అనంద్ వెళ్తున్న రైలు..దాహోద్ సమీపంలోకి రాగానే ఇంజన్ లో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఇంజిన్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇతర బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన రైల్వే లోకో పైలెట్ ,ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో చైన్ ను లాగిన ప్రయాణికులు..రైలు ఆగిన వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
Also Read :- పడితే పోతావ్ రా.. రైలు బోగీ వెనకలా ఇలా ప్రయాణం
అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది..మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
VIDEO | Fire breaks out in engine of Dahod-Anand Memu train near Dahod in Gujarat. More details are awaited. pic.twitter.com/1KvAbBZd76
— Press Trust of India (@PTI_News) September 15, 2023
రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు దిగిపోతుండగా.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని దహోద్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. చివరి కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయని, మిగిలిన కంపార్ట్మెంట్లను రక్షించామని ఏఎస్పీ కె.సిధాంత్ ఈ సందర్భంగా తెలిపారు.
