- మర్డర్ కేసును ఛేదించిన కుషాయిగూడ పోలీసులు.. ఐదుగురి అరెస్ట్
కుషాయిగూడ, వెలుగు: పోస్టుమార్టం రిపోర్టుతో బయటపడ్డ మర్డర్ కేసులో నిందితులను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య, కూతురు(17), కొడుకుతో కలిసి కాప్రాలో ఉండే రామకృష్ణ ఓ గ్యాస్ఏజెన్సీలో వర్కర్గా పనిచేసేవాడు. గతేడాది రామకృష్ణ కుటుంబం నారాయణగూడలో ఉన్న టైమ్లో వాచ్మన్ కొడుకు భూపాల్(20), రామకృష్ణ కూతురితో సన్నిహితంగా ఉండేవాడు. ఆమె భూపాల్కి డబ్బు ఇవ్వగా బైక్, కెమెరా, డ్రెస్లు కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ.. భూపాల్కు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భూపాల్ మారకపోవడంతో మైనర్ అయిన తన కూతురితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నారాయణగూడ పోలీసులకు రామకృష్ణ కంప్లయింట్ చేశాడు. దీంతో పోక్సో యాక్ట్ ప్రకారం భూపాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ ఏడాది జులైలో జైలు నుంచి విడుదలైన భూపాల్.. తీరు మార్చుకోకపోగా, రామకృష్ణ కూతురుని మళ్లీ కలవడం మొదలు పెట్టాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ, ఫ్రెండ్స్తో కలిసి రామకృష్ణను చంపేందుకు స్కెచ్ వేశాడు. గత జులై 19న సాయంత్రం రామకృష్ణ ఇంటి వద్దకు వెళ్లిన భూపాల్ అతడి కూతురికి స్లీపింగ్ పౌడర్ ఇచ్చాడు. దానిని ఆమె ఇంట్లో చికెన్ కర్రీలో కలిపింది. అది తిన్న రామకృష్ణ, తల్లి, అన్న నిద్రలోకి వెళ్లారు. అర్ధరాత్రి 1 గంటకు భూపాల్తో పాటు అతడి ముగ్గురు ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్లి నిద్రపోతున్న రామకృష్ణపై బ్లాంకెట్తో నోరు మూసి, గొంతుపై కత్తితో పొడిచారు. అలజడి కావడంతో రామకృష్ణ భార్య, కొడుకు లేచి చూశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రామకృష్ణను హాస్పిటల్కి తీసుకెళ్లగా.. డాక్టర్లు పరిశీలించి చనిపోయాడని నిర్ధారించారు. రామకృష్ణ భార్య కంప్లయింట్తో పోలీసులు కేసు నమోదు చేసి.. డెడ్బాడీని పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. రామకృష్ణ ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురైనట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. దీంతో పోలీస్స్టేషన్కు రామకృష్ణ భార్యను పిలిచి విచారించారు. కూతురిని కాపాడుకోవడానికే అబద్దం చెప్పాల్సి వచ్చిందని ఆమె పోలీసుల వద్ద ఒప్పుకుంది. దీంతో పోలీసులు శుక్రవారం రామకృష్ణ కూతురు(17)తో పాటు ప్రధాన నిందితుడు భూపాల్, అతడి ఫ్రెండ్స్ ప్రశాంత్(19), గణేష్ (20), విజయపాల్ (45)ను అరెస్ట్ చేశారు. కత్తి, సెల్ ఫోన్లను, స్లీపింగ్పిల్స్, బైక్ను సీజ్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తెలిపారు.