అక్రమాలకు పాల్పడుతున్రు : మధుసూదన్​రెడ్డి

అక్రమాలకు పాల్పడుతున్రు : మధుసూదన్​రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డిఆరోపించారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్  ఆరాచక పాలన నుంచి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్  పార్టీ విముక్తి కల్పిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్, వసంత, సిరాజ్ ఖాద్రీ, రాములు యాదవ్, బురుజు సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలీ, రాములు యాదవ్, అవేజ్, చంద్రశేఖర్, మల్లేశ్​ పాల్గొన్నారు.