గేమ్ బ్యాన్పై మానసిక ఆందోళన వద్దు
నిన్నటిదాకా చిన్నాపెద్ద గంటల తరబడి పబ్జీలోనే..
ఇప్పుడు కోపం, చిరాకు పెరిగే ప్రమాదం
మరో అడిక్షన్ వైపు మళ్లే చాన్స్
పేరెంట్స్ ప్రిపేర్డ్గా ఉండాలంటున్న సైకాలజిస్ట్లు
సిటీలోని విష్ణుపురి కాలనీకి చెందిన సాంబశివ టెన్త్ క్లాస్ స్టూడెంట్. ఎప్పుడూ పబ్జీ గేమ్ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. మొదట్లో తల్లిదండ్రులు చూసీచూడనట్లు ఉన్నారు. ఎగ్జామ్స్ టైమ్లోనూ గంటల తరబడి గేమ్ ఆడుతుండడంతో తల్లి గట్టిగా మందలించింది. మనస్తాపానికి గురైన సాంబశివ రూమ్ లోకి సూసైడ్ చేసుకున్నాడు. గతేడాది ఏప్రిల్లో జరిగిన ఘటన ఇది.
పుప్పాలగూడలోని శ్రీరాంనగర్లో ఉండే సమీర్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. పబ్ జీ ఆడుతూ స్టడీ పక్కన పెట్టడంతో తల్లి సెల్ఫోన్ తీసుకుంది. దాంతో సమీర్ ఇంటి నుంచి వెళ్లి ఏటీఎంలో మనీ డ్రా చేసుకుని బస్లో ముంబయి బయల్దేరాడు. దారిలో ఒక స్టేషన్ దగ్గర బస్ మిస్ అవడంతో వేరొకరి మొబైల్ నుంచి తల్లికి ఫోన్ చేసి ‘‘నీ కొడుకును కిడ్నాప్ చేశాం. 3 లక్షలు ఇస్తే విడిచి పెడ్తాం”అని బ్లాక్మెయిల్ చేశాడు. తల్లి పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ మెసేజ్ ద్వారా పోలీసులు అతన్ని పట్టుకుని తల్లికి అప్పగించారు. 2019 అక్టోబర్ లో ఇది జరిగింది.
హైదరాబాద్, వెలుగు: టైంపాస్గా మొదలుపెట్టిన ఆన్లైన్ గేమ్లు ప్రాణాలు తీసేదాకా వస్తున్నాయి. బ్లూ వేల్ గేమ్ నుంచి పబ్జీ దాకా అనేకమందిపై ఎఫెక్ట్చూపాయి. దేశవ్యాప్తంగా 3.3కోట్ల మంది పబ్ జీ గేమ్ లో యాక్టివ్ గా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎక్కువమంది యూజర్లు ఉన్నారు. లాక్ డౌన్ లో అనేకమంది ఈ గేమ్ని ఇన్ స్టాల్ చేసుకున్నారు. కొందరు గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆడగా, మరికొందరు ఆన్లైన్ టోర్నమెంట్స్దాకా వెళ్లారు. తెలియకుండానే గేమ్కి అడిక్ట్ అయ్యి చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవారు. మందలిస్తే ఎలా రెస్పాండ్ అవుతారోనన్న భయంతో ఒక దశలో తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. బుధవారం పబ్జీ గేమ్ని కేంద్రం బ్యాన్ చెయ్యడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా వ్యసనాన్ని ఒకేసారిఆ పేస్తే మానసిక స్థితి నిలకడగా ఉండదని, అలాంటి వారి విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్ట్ లు సూచిస్తున్నారు.
డైవర్ట్ అయ్యేలా..
మందుకు బానిసైన వాళ్లలో చాలామంది దానికి దూరమవ్వాలంటే మరొక అడిక్షన్ వైపు మళ్లుతుంటారు. పబ్జీకికి అడిక్ట్ అయినవారు కూడా ఇప్పుడు ఇతర అడిక్షన్ వైపు డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందని సైకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి దాకా ఈ గేమ్తోనే సావాసం చేసిన వాళ్లు ఎందరో. వారిలో పదేండ్ల నుంచి 30ఏండ్ల వారి వరకూ ఉన్నారు. టైంపాస్ అవడం లేదని, గేమ్ ద్వారా ఆన్లైన్ కనెక్టివిటీ పెరుగుతుందని ఆడుతున్న చాలామంది చెప్పేవారు. గేమ్లో అచీవ్మెంట్స్, అప్రిషియేషన్స్ వంటివి ఉండటం వల్ల ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. అలాంటి గేమ్ను ఒకేసారి మానేయడం వల్ల పిల్లల్లో యాంగర్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉందని సైకాలజిస్ట్లు చెప్తున్నారు. దాన్నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పేరెంట్స్ ప్రిపేర్ అయి ఉండాలంటున్నారు. పిల్లలను ఒంటరిగా వదలకుండా కనిపెడుతూ ఉండాలని, వేరే యాక్టివిటీస్లో బిజీ చేయాలని సూచిస్తున్నారు. లోన్లీ ఫీల్ రానివ్వకూడదంటున్నారు. మరీ అగ్రెసివ్గా ప్రవర్తిస్తే సైక్రియాట్రిస్ట్ ద్వారా సెషన్స్ ఇప్పించాలని చెప్తున్నారు.
మరొక అడిక్షన్వైపు మళ్లకుండా..
ఏదైనా అడిక్షన్ నుంచి బయటపడటాన్ని విత్ డ్రాల్స్ అంటారు. ఇప్పుడు పబ్జీ అడిక్ష న్ కూడా అంతే. ఏదైనా అలవాటును ఒక్క సారిగా మానేస్తే అది మానసిక పరిస్థితిపై బాగా ప్రభావం చూపిస్తుంది. గేమ్ బ్యాన్ తో చాలామందిలో ఇరిటెబులిటీ, అగ్రెసివ్ నెస్, ఆర్గ్యుమెంట్ నేచర్ పెరగొచ్చు. ఏ విషయం పైనా కాన్సట్రేట్ చేయాలనుకోరు. ఇతరులు చెప్పేది వినిపించుకోరు. ఊరికే కోపానికి వస్తుంటారు. ఈ గేమ్ను మర్చిపో యేందుకు ఇంకేదో వ్యసనం వైపు మళ్లేం దుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారి విష యంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. గేమ్ లైఫ్ కాదని అర్థమయ్యేలా చెప్పాలి. ఇలాంటి టైమ్లో ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. – డాక్టర్ హరిణి, సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్
అర్ధరాత్రి దాకా గేమ్లోనే..
నాకు ఇద్దరు పిల్లలు. స్టడీస్ వల్ల స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సి వచ్చింది. అప్పటి నుంచి పబ్జీ తప్ప ఇంకోటి లేదు. అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ గేమ్ ఆడుతుంటారు. కొన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా వినిపించుకోరు. అదే లోకమై వేరే ఈ విషయం మీద కూడా ఫోకస్ చేయట్లేదు. గేమ్ బ్యాన్ చేశారని తెలిసి రిలీఫ్ ఫీల్ అయ్యాం.‑ మమత, పేరెంట్, మధురానగర్
ఇప్పుడు బోరింగ్
నాకు మొదట్లో గేమ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫ్రెండ్స్ ఫోర్స్ తో ఆడేవాన్ని. కానీ లాక్ డౌన్ లో ఎటూ వెళ్లే చాన్స్ లేకపోవడంతో పబ్జీ ఆడటం అలవాటైంది. ఇంక ఇప్పుడంతా బోరింగ్. ‑ విక్రమ్, స్టూడెంట్, మదాపూర్.