4వేల మంది తబ్లిగీ జమాత్ సభ్యుల విడుదలకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు

 4వేల మంది తబ్లిగీ జమాత్ సభ్యుల విడుదలకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు

తబ్లిగీ జమాత్ సభ్యులకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ క్రమంలో క్వారంటైన్ గడువును పూర్తి చేసుకున్న 5 వేల మంది తబ్లిగీ సభ్యులను విడుదల చేయాలని ఇవాళ(బుధవారం) ఆదేశించింది. అయితే.. మర్కజ్ ఘటనతో సంబంధం ఉన్నవారిని మాత్రం విచారణ కోసం ఢిల్లీ పోలీసుల కస్టడీకి అప్పగించాలని హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మర్కజ్ ఘటనతో సంబంధం లేని వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని ఆదేశించినట్టు హోం మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల రెసిడెంట్ కమిషనర్లతో సంప్రదింపులు జరపాలని హోం శాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు.

ఢిల్లీ క్వారంటైన్లలో అధికారిక లెక్కల ప్రకారం 4 వేల మంది తబ్లిగీ సభ్యులు ఉన్నారు. వీరిలో 900 మంది ఢిల్లీకి చెందినవారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువగా తెలంగాణ, తమిళనాడుకు చెందినవారని చెప్పారు.