
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఈ నెల 13 (జూన్ 13, సోమవారం) వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉండనున్నారు.
Delhi Health Minister Satyendar Jain brought to Rouse Avenue District Court at the end of his ED custody today
— ANI (@ANI) June 9, 2022
Jain was arrested by Enforcement Directorate in an alleged money laundering case on May 30. pic.twitter.com/XFUFy5CZ5R
ఇటీవలే మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 2.82 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సత్యేంద్ర జైన్ భార్య, కుమార్తెలకు మెమోలను ఈడీ అధికారులు అందచేశారు. 2015, 16లో కోల్కతాకు చెందిన ఓ కంపెనీతో జైన్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. గత నెల 30న జైన్ ను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన మూలాన్ని ఆయన వివరించలేదని, అనేక కంపెనీలను కొనుగోలు చేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండిస్తున్నారు. అవన్నీ అబద్దాలేనని, ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడలేక, దాడులు చేస్తున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sleep apnea was one of the problems that he (Satyendar Jain) was facing since he recovered from COVID-19. When he came out of the court, he was not feeling well and was later sent to a hospital: Advocate Rishikesh Kumar, lawyer of Satyendar Jain pic.twitter.com/W9MycnksRe
— ANI (@ANI) June 9, 2022