శ్రీ మహాలక్ష్మి అవతారంలో దేవీ దర్శనం

శ్రీ మహాలక్ష్మి అవతారంలో దేవీ దర్శనం

కాగజ్ నగర్/దహెగాం, వెలుగు: కాగజ్​నగర్​పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందిరా మార్కెట్​లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

సిర్పూర్ టీ లోని పురాతన వెంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దహెగాంలోని శివకేశవాలయంలో వెలసిన దుర్గా మండపంలో అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని గులాబీ రంగు చీరెలో అలంకరించి పూజలు చేశారు.