పరిగి, వెలుగు: డీహెచ్ఎం 20 హైబ్రిడ్ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుజాత తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొక్కజోన్న పంట దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. లుథియానా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కజొన్న పంటను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
అనంతరం 63 మంది రైతులకు ఫ్రీగా మొక్కజొన్న సీడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, సైంటిస్టులు మల్లయ్య, శ్రావణి, టి.రాజేశ్వర్రెడ్డి, మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
