సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మెరిట్‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల పంపిణీ

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మెరిట్‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల పంపిణీ

గోదావరిఖని, వెలుగు: నీట్‌‌‌‌లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌‌‌‌లో సీటు సాధించిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఆర్జీ 1 జీఎం లలిత్​ కుమార్​ మెరిట్‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌ షిప్​ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. జీఎం ఆఫీస్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్‌‌‌‌లో థియేటర్​ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేసే సుధాకర్​ కూతురు శ్రీహర్షిత, ఎస్అండ్​పీసీ సెక్యూరిటీ గార్డు దేవాజీ కుమార్తె వైష్ణవి, స్టాఫ్‌‌‌‌​నర్స్​ టి.మణెమ్మ కొడుకు చందన్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు రూ.16 వేల చొప్పున చెక్కులను జీఎం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీబీఎస్​ సీట్లు సాధించిన విద్యార్థులను సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వీరి చదువు పూర్తయ్యే వరకు ఏటా రూ.16 వేల చొప్పున ఫీజు రీయింబర్స్​మెంట్​ కింద ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డెలిగేట్​ రాజు, ఏజెంట్​చిలుక శ్రీనివాస్​, ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీవైపీఎం వేణు, సీనియర్ పీవోలు శ్రావణ్ కుమార్, హన్మంత రావు, అధికారులు పాల్గొన్నారు.