అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యూఎస్ వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన నివాసంలో దీపావళి వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన భర్త, పిల్లలతో కలిసి టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. ఇల్లంతా దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖ భారతీయ అమెరిన్లు హాజరయ్యారు.  వాషింగ్టన్‌లోని ఆమె అధికారిక నివాసం ‘నావల్‌ అబ్జర్వేటరీ’లో శుక్రవారం రాత్రి దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నామని కమలా హారిస్ చెప్పారు. చీకటి క్షణాల్లో వెలుగులు నింపాల్సిన మన శక్తిసామర్థ్యాలను దీపావళి గుర్తుకు తెస్తుందని పేర్కొన్నారు. చిన్నతనంలో అమ్మమ్మ, తాతయ్యలతో మద్రాసులో జరుపుకున్న దీపావళి వేడుకలను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘జయహో’, ‘ఓం శాంతి’ తదితర బాలీవుడ్‌ పాటలకు చిందులు వేసి నృత్యకారులు అలరించారు. అతిథులకు పానీపూరి సహా వివిధ భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించారు. అమెరికా సర్జన్‌ జనరల్‌ డా.వివేక్‌మూర్తి, అధ్యక్షుడి ప్రత్యేక సలహాదారు నీరా టాండన్‌, బైడెన్‌ ప్రసంగాల రచయిత వినయ్‌రెడ్డి, ఇండియాస్పోరా వ్యవస్థాపకులు ఎం.ఆర్‌.రంగస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.