ఆశా కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలి : డీఎంహెచ్ఓ జయలక్ష్మి

ఆశా కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలి : డీఎంహెచ్ఓ జయలక్ష్మి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆశా కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని డీఎంహెచ్​ఓ డాక్టర్​ జయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్​ఓ ఆఫీస్​లో గురువారం ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటి ఫీవర్​ సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

 వర్షాలు, వరదల టైంలో గర్భిణుల విషయంలో అలర్ట్​గా ఉండాలన్నారు.