
మ్యూనిక్: ఇండియా షూటర్లు ఆర్యా బోర్సే–అర్జున్ బబుటా జోడీ.. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో స్వర్ణ పతకంతో మెరిసింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ఆర్య–అర్జున్ 17–7తో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్స్ జైఫీ వాంగ్–లిహాయో షెంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన పోరులో ఇండియా ద్వయం.. చైనా ప్రత్యర్థులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఓవరాల్గా ఈ వరల్డ్ కప్లో ఇండియాకు ఇది నాలుగో మెడల్ కాగా, రెండో గోల్డ్ కావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ క్వాలిఫికేషన్లో మను భాకర్–ఆదిత్య మాల్రా (577), సురుచి సింగ్–వరుణ్ తొమర్ (576) వరుసగా ఆరు, పదో ప్లేస్లతో సరిపెట్టుకున్నారు.