Kannadiga Row: బయటోళ్లు కూడా కన్నడ నేర్చుకోవాలే.. అహంకారం వద్దు: మోహన్‌దాస్ పాయ్

Kannadiga Row: బయటోళ్లు కూడా కన్నడ నేర్చుకోవాలే.. అహంకారం వద్దు: మోహన్‌దాస్ పాయ్

Mohandas Pai: తెలుగు ప్రజలకు కర్ణాటకతో ఉన్న అనుబంధం దశాబ్ధాలుగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అక్కడ వ్యాపారాలు, ఉపాధి అవకాశాలను పొందుతూ అక్కడ నివసిస్తున్నారు. ప్రధానంగా భారత ఐటీ రంగం అభివృద్ధితో బెంగళూరు వెళుతున్న యువత ఉద్యోగ రీత్యా అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కానీ కన్నడిగుల్లో ఉన్న భాషాభిమానం చాలా మంది బయటి నుంచి వచ్చిన ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతోంది.

తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ కీలక కామెంట్స్ చేశారు. కర్ణాటకలో భాషా వినియోగంపై కొనసాగుతున్న అనేక వివాధాల మధ్య ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కన్నడ భాషను బయటి నుంచి వచ్చిన వారు నేర్చుకోవాలని సూచించారు. ప్రజలతో కమ్యూనికేషన్ కోసం ఇది తప్పనిసరిగా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి బెంగళూరు ప్రజలను కలుపుకునిపోయే నగరాల్లో ఒకటని.. కొందరు తమ ఆధిపత్యాన్ని చూపించేందుకే స్థానిక భాషను నేర్చుకోవటాన్ని తిరస్కరిస్తూ వివాదాలకు కారణంగా మారుతున్నారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని పాయ్ అభిప్రాయపడ్డారు.

బెంగళూరుకు వస్తున్న కొందరిలో పెరిగిపోతున్న అహంకారాన్ని పాయ్ తప్పుప్టారు. కనీసం బేసిక్ కన్నడ పదాలను నేర్చుకోవటానికి కూడా వారు సిద్ధంగా లేరని అన్నారు. ఈ మైండ్ సెట్ స్థానికులకు బయటి నుంచి వచ్చివారి మధ్య గొడవలకు దారితీస్తోందని అన్నారు. టెక్ క్యాపిటల్ గా ఉన్న కర్ణాటక దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలను ఆహ్వానించి వారికి అవకాశాలను కల్పించిందని.. దానికి బదులుగా కన్నడిగులు కోరుకుంటోంది కేవలం స్థానిక సంస్కృతిని గౌరవించటమేనన్నారు. ఇది మాట్లాడే భాష నుంచి మెుదలవుతుందని పాయ్ అభిప్రాయపడ్డారు.

 

కొన్ని రోజుల కిందట ఒక స్టేట్ బ్యాంక్ మేనేజర్ కన్నడలో మాట్లాడటానికి నిరాకరిస్తూ.. ఒక కస్టమర్ తో అతనికి అర్థం కాని హిందీ భాషలో దురుసుగా ప్రవర్తించటం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. తాను ఇంకా కన్నడ నేర్చుకుంటున్నానని, నా సహచరులు మీకు సాయం చేస్తారని చెప్పి ఉంటే వివాదం అక్కడిదాకా వచ్చేదికాదని పాయ్ అన్నారు. దేశంలోని ప్రజలు తమ ఉద్యోగ వ్యాపార అవసరాల కోసం ఇతర నగరాలు లేదా ప్రాంతాలకు వెళుతుంటే అక్కడి స్థానిక భాష నేర్చుకోవటానికి ప్రయత్నించమని పాయ్ సూచించారు. అది కన్నడ అయినా, బెంగాలీ అయినా లేక మరాఠీ అయినా సరే. అప్పుడే మనం అక్కడి సంస్కృతిని గౌరవించినట్లవుతుందని పేర్కొన్నారు. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలకు హిందీ, ఇంగ్లీష్ ఇప్పటికీ రావని పాయ్ చెప్పారు.