న్యూఢిల్లీ: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. సాత్విక్–చిరాగ్ ఆసియా గేమ్స్లో హిస్టారిక్ గోల్డ్ మెడల్ సహా ఈ మధ్య పలు టోర్నీల్లో గెలిచారు. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్, థామస్ కప్ టైటిల్, వరల్డ్ చాంపియన్షిప్స్ బ్రాంజ్ మెడల్ కూడా సొంతం చేసుకున్నారు.
ఈ సీజన్లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన షట్లర్లకు డిసెంబర్ 11న హాంగ్జౌలో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ గాలా డిన్నర్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఇస్తారు.