న్యూఢిల్లీ : చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉందని, మన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుందని ఎయిమ్స్ మాజీ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. దేశంలో కేసులు ఎక్కువగా నమోదు కాకపోయినా కరోనా విషయం లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో బుధవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.
‘‘కరోనా కేసుల విషయం లో సరైన సర్వైలెన్స్ అవసరం. ఎక్కడైనా కేసులు పెరగడం ప్రారంభమైతే, వెంటనే ఆ ప్రాంతంలో టెస్టులు చేయొచ్చు. దీంతో కొత్త వేరియంట్లు ఏమైనా బయటపడితే వ్యాప్తిని అడ్డుకోవచ్చు. మన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుంది. హైరిస్క్ లో ఉన్న చాలా మంది ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకు న్నారు” అని గులేరియా పేర్కొన్నారు.