ఇండియన్ డిఫెన్స్‌లోకి.. పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్

ఇండియన్ డిఫెన్స్‌లోకి.. పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వరుస విజయాలని తన ఖాతాలో వేసుకుంటోంది. భారత సైన్యం దేశీయ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్ ను శనివారం రాజస్థాన్ లో పరీక్షించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన ఈ క్షిపణి వ్యవస్థను ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉన్నది. దీంతో సైన్యం ఈ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను ఈసీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇందులో ఎంపీఏటీజీఎం, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ ఎక్విప్మెంట్, ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి. యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్డీవో, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రశంసించారు.

ఆధునిక సాంకేతిక ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో స్వావలంబన సాధించే దిశగా ఇది ఓ కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ ఆయుధ వ్యవస్థను శనివారం పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిస్సైల్‌ సిస్టమ్‌ అద్భుతమైన పనితీరును పరీక్షించిందని తెలిపింది. ఈ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను పగలు, రాత్రి సమయాల్లోనూ వినియోగించవచ్చని చెప్పింది.