కాళేశ్వరంపై తెచ్చిన అప్పు ఎంత..? తీర్చినది ఎంత..? : ఎమ్మెల్యే రఘునందన్ రావు

కాళేశ్వరంపై తెచ్చిన అప్పు ఎంత..? తీర్చినది ఎంత..? : ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్లు అప్పు తీసుకొచ్చింది..? ఇప్పటి వరకు తీర్చిన అప్పు ఎంతో  ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు ఎప్పుడో తీరిపోయాయని కేసీఆర్ సోమవారం (జులై 24న) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.86వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పిన ఆర్థికశాఖ మంత్రి..వాటిని ఎప్పుడు..? ఏ విధంగా తీర్చారో చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రూ. 3లక్షల కోట్ల అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అప్పు ఎక్కడిదో.. ఎప్పటిదో.. రాష్ర్ట ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.