బీఆర్ఎస్ తోనే మ‌రింత‌ అభివృద్ధి సాధ్యం : ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

బీఆర్ఎస్ తోనే  మ‌రింత‌ అభివృద్ధి సాధ్యం : ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

లక్ష్మణచాంద(మామడ), వెలుగు : సీఎం కేసీఆర్ సార‌థ్యలోని స‌ర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని,  మూడోసారి బీఆర్ఎస్​కే ప‌ట్టం క‌ట్టాల‌ని మంత్రి, నిర్మల్​అభ్యర్థి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం మామ‌డ మండ‌లం వాస్తపూర్ లో గుస్సాడీ నృత్యం, మంగ‌ళ‌ హార‌తులతో, బ‌తుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో మ‌హిళ‌లు మంత్రికి స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిపేస్టో నిరుపేద‌ల‌కు వ‌రం లాంటిదన్నారు. తండాల‌ను గ్రామ‌పంచయతీలుగా చేసిన ఘనత బీఆర్​ఎస్​ సర్కారుదేనన్నారు.

ఇగ ఎన్నిక‌ల ఎప్పుడూ ఈ ఊరి ముఖం చూడ‌ని బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు ఓట్ల కోసం ఇప్పుడు వ‌స్తున్నారని.. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్న ఒక్క సంక్షేమ ప‌థ‌కమైనా అమ‌ల‌వుతుందా అని ఆ పార్టీల లీడర్లను ప్రశ్నించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, హరీశ్ కుమార్, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, గంగారెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్ గౌడ్, పాల్గొన్నారు.