![ఇయ్యాల్టి నుంచి ఈ-బైక్ మిహోస్ బుకింగ్స్](https://static.v6velugu.com/uploads/2023/01/E-bike-Mihos-bookings-from-Today_JtfmCXFYaN.jpg)
జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్లైన్ బుకింగ్లు జనవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. దీని ధర రూ. 1,49,000 (ఎక్స్-షోరూమ్) కాగా మొదటి 5000 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. మిహోస్ను పాలీ డిసైక్లోపెంటాడైన్తో తయారు చేశారు. దీనివల్ల ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ నుంచి లేదా షోరూమ్ల నుంచి మిహోస్ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి నుంచి మొదలవుతాయి.