న్యూఢిల్లీ: వస్తువుల రేట్లను పెంచేసి, ఆ తర్వాత వాటిపై ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయని, ఇలాంటి పద్ధతులపై రెగ్యులేటరీ ఏజన్సీలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కట్స్ ఇంటర్నేషనల్ ఒక రిపోర్టులో వెల్లడించింది. ఈ–కామర్స్కంపెనీల ఈ పద్ధతి వల్ల నిజానికి కస్టమర్లు మోసపోతున్నారని పేర్కొంది. ఎక్కువ రేట్లు చూపించి డిస్కౌంట్లు ఇవ్వడంతో తాము ఆదా చేస్తున్నామనే ధోరణికి కస్టమర్లు వస్తున్నారని వివరించింది.
ఫ్లాష్సేల్స్పై గంపగుత్తగా నిషేధం విధించడం వంటి చర్యలు కాకుండా, కన్జూమర్ల పరిరక్షణ పై రెగ్యులేటరీ ఏజన్సీలు ఫోకస్ పెట్టాలని కట్స్ ఇంటర్నేషనల్ సూచించింది. మార్కెట్లో అందరికీ సమానమైన అవకాశాలు ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పేర్కొంది. రేట్లను పెంచేసి, భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న ఈ–కామర్స్ సెక్టార్పై ప్రభుత్వం లేదా సంబంధిత రెగ్యులేటరీ ఏజన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని కట్స్ ఇంటర్నేషనల్ తన రిపోర్టులో కోరింది. ఈ–కామర్స్ కంపెనీలు పాటిస్తున్న ఈ పద్ధతి అనైతికమైనదని వెల్లడించింది.
స్టేటస్ ఆఫ్ ఈ–కామర్స్ ఇన్ ఇండియా పేరుతో కట్స్ ఇంటర్నేషనల్ ఈ రిపోర్టును రిలీజ్ చేసింది. నిలకడైన ఈ–కామర్స్ ఎకోసిస్టమ్ ప్రమోట్ చేసేందుకు ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ సెల్లల్లర్లు ఉండాలని చెబుతూ, కానీ లాభాల మార్జిన్లు తగ్గించేసుకుని ఆర్థికంగా దివాలా తీసేలా తక్కువ రేట్లకు అమ్మకూడదని రిపోర్టు సూచించింది.
డీప్ డిస్కౌంటింగ్, ప్రెడేటరీ ప్రైసింగ్ల మధ్య తేడా ఏమిటనే అంశంపై క్లారిఫికేషన్ ఆవశ్యకమని అభిప్రాయపడింది. దేశంలోని ప్రజలకు అర్థమయ్యేలా కంటెంట్, ఇంటర్ఫేస్లను రీజినల్లాంగ్వేజ్లోనూ ఆన్లైన్ రిటైల్ ప్లేయర్లు అందుబాటులోకి తేవడం అవసరమని స్పష్టం చేసింది.