చిదంబరానికి ఈడీ నోటీసులు

చిదంబరానికి ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: ఎయిర్​ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించిన డీల్​విచారణలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కు ఎన్ ఫోర్స్​మెంట్​డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు పంపింది. విచారణ కోసం ఈ నెల 23న హాజరుకావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సివిల్​ఏవియేషన్​మాజీ మంత్రి ప్రఫుల్​పటేల్​ను ఈడీ విచారించింది. అప్పట్లో చిదంబరం ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపాకే కొనుగోలు జరిగిందని ప్రఫుల్​వెల్లడించినట్లు సమాచారం. విమానాల కొనుగోలు, ఎయిర్​ఇండియాలో ఇండియన్ ఎయిర్​లైన్స్​విలీనం.. ఈ రెండు నిర్ణయాలకూ కేబినెట్​ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో చిదంబరంను విచారించేందుకు ఈడీ సమన్లు పంపించింది. 2007లో అప్పటి యూపీఏ సర్కారు ఎయిర్​ఇండియా కోసం 70 వేల కోట్లు ఖర్చుపెట్టి 111 విమానాలను కొంది. ఇందులో 43 విమానాలను ఎయిర్​బస్​నుంచి, 68 విమానాలను బోయింగ్​కంపెనీ నుంచి ఖరీదు చేసింది. ఈ డీల్​లో భారీ కుంభకోణం జరిగిందని, ఆ తర్వాతే ఎయిర్​ఇండియా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఫ్రాఫిటబుల్​రూట్లను విదేశీ ఎయిర్​లైన్స్​కంపెనీలకు అప్పజెప్పారన్న ఆరోపణలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో కార్పొరేట్​లాబీయిస్ట్​దీపక్​తల్వార్​ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.