న్యూఢిల్లీ: ఎయిర్ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించిన డీల్విచారణలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కు ఎన్ ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు పంపింది. విచారణ కోసం ఈ నెల 23న హాజరుకావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సివిల్ఏవియేషన్మాజీ మంత్రి ప్రఫుల్పటేల్ను ఈడీ విచారించింది. అప్పట్లో చిదంబరం ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపాకే కొనుగోలు జరిగిందని ప్రఫుల్వెల్లడించినట్లు సమాచారం. విమానాల కొనుగోలు, ఎయిర్ఇండియాలో ఇండియన్ ఎయిర్లైన్స్విలీనం.. ఈ రెండు నిర్ణయాలకూ కేబినెట్ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో చిదంబరంను విచారించేందుకు ఈడీ సమన్లు పంపించింది. 2007లో అప్పటి యూపీఏ సర్కారు ఎయిర్ఇండియా కోసం 70 వేల కోట్లు ఖర్చుపెట్టి 111 విమానాలను కొంది. ఇందులో 43 విమానాలను ఎయిర్బస్నుంచి, 68 విమానాలను బోయింగ్కంపెనీ నుంచి ఖరీదు చేసింది. ఈ డీల్లో భారీ కుంభకోణం జరిగిందని, ఆ తర్వాతే ఎయిర్ఇండియా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఫ్రాఫిటబుల్రూట్లను విదేశీ ఎయిర్లైన్స్కంపెనీలకు అప్పజెప్పారన్న ఆరోపణలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో కార్పొరేట్లాబీయిస్ట్దీపక్తల్వార్ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.
చిదంబరానికి ఈడీ నోటీసులు
- దేశం
- August 20, 2019
లేటెస్ట్
- మొయినాబాద్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి
- రేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు: ఖర్గే
- కవిత బెయిల్ పిటిషన్ విచారణ.. మే 24కు వాయిదా
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- Varalakshmi Sarathkumar: ముందు మీరు చేయండి.. నెటిజన్స్పై వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్
- Summer Health : ఎండలో తిరిగినప్పుడు మీ చర్మం నల్లగా, ఎర్రగా మారుతుందా.. ?
- మీరే మొనగాడు : టీమిండియాకు కోచ్ గా మళ్లీ రాహుల్ ద్రవిడ్
- Summer Health : ఎండాకాలం గాలితో ప్రమాదం.. చర్మ వ్యాధుల ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..!
- షాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు
- ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- SRH vs LSG: హైదరాబాద్- లక్నో మ్యాచ్పై ఫన్నీ మీమ్స్.. మీరూ చూసేయండి
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా
- Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు