
- జార్ఖండ్లో జరిగిన ఘటనను ‘ఎక్స్’ లో షేర్ చేసిన కేంద్ర మంత్రి
రాంచీ: ఓ ఏనుగు రైల్వే ట్రాక్పై ప్రసవించడంతో ఆ మార్గంలో వెళ్లే రైలు రెండు గంటల పాటు నిలిచిపోయింది. జార్ఖండ్లో జరిగిన ఈ ఘటన కెమెరాల్లో రికార్డు అయింది. అందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‘ఎక్స్’లో షేర్ చేశారు.
గర్భంతో ఉన్న ఓ ఏనుగు రైల్వే ట్రాక్పై ప్రసవ వేదన పడుతోంది. అదే సమయంలో రైలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును వారు వెంటనే ఆపేశారు. దాదాపు రెండు గంటల పాటూ ట్రాక్ పైనే రైలు నిలిచిపోయింది. సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.
‘‘మానవ–-జంతు ఘర్షణల వార్తలకు అతీతంగా ఈ ఘటనను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఏనుగు తన బిడ్డకు జన్మనిస్తుండటంతో జార్ఖండ్ లో ఓ రైలును రెండు గంటల పాటు నిలిపేశారు. ఏనుగు ప్రసవించడానికి సహకరించిన జార్ఖండ్ అటవీ అధికారులకు ప్రత్యేక అభినందనలు” అని పేర్కొన్నారు.