
భారత్ అత్యవసర హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్ లేదా నార్మల్ మొబైల్ నోటిఫికేషన్లలా కాకుండా ఎమర్జెన్సీ అలర్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎమర్జెన్సీ అలర్ట్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొబైల్ స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్, డిస్టర్బ్ మోడ్లలో ఉన్నా అలర్ట్ పెద్ద సౌండ్తో లేదా సైరన్లా వినిపిస్తుంది. ఉగ్రదాడి, వరదలు, భూకంపం వంటి సమయాల్లో ప్రజల్ని అలర్ట్ చేస్తుంది. కొన్ని సెకన్లలోనే లక్షల మందికి అన్ని భాషల్లో అలర్ట్ నోటిఫికేషన్లు వెళ్తాయి.
ఆండ్రాయిడ్లో..
సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి ‘సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ’ లేదా ‘ఎమర్జెన్సీ అలర్ట్స్’ మీద ట్యాప్ చేయాలి. అందులో ‘వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్’ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. అందుబాటులో ఉన్న అలర్ట్ ఆప్షన్స్ అన్నింటినీ యాక్టివేట్ చేయాలి. ఈ ఆప్షన్స్ మీ మొబైల్ మోడల్ని బట్టి వేర్వేరు పేర్లతో ఉండొచ్చు. ఒకసారి మీ మొబైల్లో ఆప్షన్ ఎలా ఉందో సెర్చ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి.
ఐఫోన్లో..
సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్కి వెళ్లాలి. అందులో కిందకి స్క్రోల్ చేస్తే గవర్నమెంట్ అలర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలర్ట్స్, క్రిటికల్ అప్డేట్స్ కోసం టోగుల్ చేయాలి.
డాన్స్ ఆప్ ది హిల్లరీ.. పాక్ సైబర్ దాడి!
ప్రస్తుతం దేశంలో సైబర్ దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడులకు గురవుతోన్న రిపోర్ట్స్ కూడా వచ్చాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వంటి మాల్వేర్ ద్వారా వైరస్ వ్యాపిస్తున్నట్టు తెలిపింది. ఈ వైరస్ సీక్రెట్గా డేటాను చోరీ చేస్తుంది. డిజిటల్ డివైజ్లను డ్యామేజ్ చేస్తుంది. ఈ మాల్వేర్ వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో వీడియో లేదా డాక్యుమెంట్ రూపంలో కనిపిస్తుంది. దీన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే సైలెంట్గా వైరస్ను బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాల్ చేస్తుంది.
►ALSO READ | డేంజరస్ యాడ్ స్కాం..నెలకు 25లక్షలఫోన్లలో విధ్వంసం..ఇండియాలోనే అత్యధికం
హ్యాకర్లకు డివైజ్ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తుంది. దీంతో హ్యాకర్లు బ్యాంకింగ్ పాస్వర్డ్లు, పర్సనల్ డేటా, ప్రైవసీ ఫైల్స్ యాక్సెస్, లీక్ వంటివి చేస్తారు. డివైజ్ స్లో కావడం లేదా క్రాష్ అవ్వడం జరుగుతుంది. ఫోన్లు, కంప్యూటర్లు, రిమోట్గా కంట్రోల్ చేయగలరు. ‘taskche.exe’ అనే ఫైల్ ఓపెన్ చేయొద్దు. అలాగే ‘.exe’ అని కనిపించే ఏ ఫైల్స్ని ఓపెన్ చేయొద్దు.
ఇలా వ్యాపిస్తుంది
ఈ హిల్లరీ వైరస్ వీడియో అటాచ్మెంట్లతో వాట్సాప్ ఫార్వార్డ్ చేస్తుంది. ఫేక్ జాబ్ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ లేదా గవర్నమెంట్ సర్క్యులర్స్, తప్పుడు యూఆర్ఎల్లతో ఫేస్బుక్ పోస్ట్లు, హైడ్ చేసిన ఫైల్స్తో టెలిగ్రామ్, ఎక్స్ మెసేజ్ల రూపంలో వస్తుంటాయి. ఇలాంటి ఫైల్స్ని క్లిక్ చేస్తే హ్యాకర్ల చేతికి చిక్కినట్లే.
మరింత జాగ్రత్త!
గుర్తుతెలియని లింక్లు, ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. సోషల్ మీడియాల్లో ‘మీడియా ఆటో డౌన్లోడ్’ ఫీచర్ను ఆఫ్ చేయాలి. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి, అప్డేట్ చేయాలి. పాస్వర్డ్లు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అవసమైన డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా తెలియని ఫైల్పై క్లిక్ చేసి హ్యాకింగ్కి గురైనట్టు గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి కంప్లయింట్ ఇవ్వాలి.
ఆన్లైన్ ఆపరేన్ ఇలా..
ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు బాధ్యతాయుతంగా ఉండాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ యూజర్లంతా చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అవేంటంటే.. ఆన్లైన్లో సూచనలు, సలహాలు, హెల్ప్లైన్లు, ఉపశమనం కలిగించే అఫీషియల్ విషయాలను మాత్రమే ఇతరులతో షేర్ చేయాలి. ఏదైనా వార్తను షేర్ చేసే ముందు దాన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసి నిజమా? కాదా తెలుసుకోవాలి. ఫేక్ న్యూస్లు కనిపిస్తే తక్షణమే రిపోర్ట్ చేయాలి. ఇకపోతే ట్రూప్ మూమెంట్స్ షేర్ చేయకూడదు. వెరిఫై చేయని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయొద్దు. హింస, మత కలహాలు రేపే పోస్ట్లను అవాయిడ్ చేయాలి.