విజిలెన్స్​ కమిషనర్‌‌గా సురేశ్ ​పటేల్ ​ప్రమాణ స్వీకారం

విజిలెన్స్​ కమిషనర్‌‌గా సురేశ్ ​పటేల్ ​ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: విజిలెన్స్​ కమిషనర్‌‌గా సురేశ్ ​ఎన్. పటేల్ ​ప్రమాణ స్వీకారం చేశారు. అహ్మదాబాద్‌లో ఉన్న పటేల్‌తో వీడియో కాన్ఫరెన్స్​ద్వారా సెంట్రల్ ​విజిలెన్స్ ​కమిషనర్‌‌ సంజయ్ ​కొఠారి బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని హై పవర్​కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పటేల్ పేరును రికమండ్​ చేసింది. బ్యాంకింగ్​ రంగంలో ఎంతో అనుభవం ఉన్న సురేశ్ .. 2015లో ఆంధ్రా బ్యాంక్​ మేనేజింగ్ ​డైరెక్టర్ అండ్ ​చీఫ్ ఎగ్జిక్యూటివ్ ​ఆఫీసర్​గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఓరియంటల్ ​బ్యాంక్​ ఆఫ్ ​కామర్స్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా పనిచేశారు.