
- బల్దియా పార్కులు, గ్రౌండ్స్నిర్వహణ బాధ్యతల అప్పగింత
- బస్తీలు, కాలనీల్లో నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ
- కేంద్ర పథకం ‘-అమృత్ మిత్ర’లో భాగం చేయాలని నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలోని బస్తీలు, కాలనీల్లోని పేద మహిళలకు చేయూతనిచ్చేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్హెల్ప్గ్రూపు మహిళల అభ్యున్నతి కోసం ‘అమృత్ మిత్ర’ పథకాన్ని అమలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది. ఈ స్కీంలో భాగంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో సెల్ఫ్హెల్ప్గ్రూపు మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని భావిస్తోంది. మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పలు ముఖ్యమైన విభాగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది.
మున్సిపల్శాఖతో పాటు తెలంగాణ మిషన్ఫర్ఎలిమినేషన్ఆఫ్పావర్టీ ఇన్మున్సిపల్ఏరియాస్(ఎంఈపీఎంఏ), తెలంగాణ అర్బన్ఫైనాన్స్అండ్ఇన్ఫ్రాస్ర్టక్చర్డెవలప్మెట్కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. అలాగే గ్రేటర్పరిధిలోని మున్సిపల్కార్పొరేషన్, మెట్రోవాటర్బోర్డు పరిధిలోని కొన్ని కీలకమైన పనులను స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహింపజేయాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంఏయూడీ అధికారులు ఆయా సంస్థలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిసింది. ముఖ్యమైన విభాగాల్లో మహిళలు చాలా సులభంగా చేయగలిగిన పనులను వారికి కేటాయించాలని ఆదేశించారు.
కేటాయించే పనులివే..
సెల్ఫ్హెల్ప్గ్రూపు మహిళలకు బల్దియా ద్వారా పార్కులు, క్రీడామైదానాల నిర్వహణను అప్పగించాలని నిర్ణయించారు. వాటర్బోర్డు నీటి సరఫరా చేసే టైంలో ఆయా బస్తీలు, కాలనీల్లో పర్యటించి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం, మురుగునీటి, మంచినీటి పైప్లైన్ల లీకేజీల గురించి అధికారులకు సమాచారం ఇవ్వడం, నీటి సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి అధికారులకు తెలియజేయడం వంటి బాధ్యతలు కట్టబెట్టనున్నారు. చదువుకోని వారైనా ఈ పనులు సులువుగా నిర్వహించవచ్చని చెప్తున్నారు.
ఈ పనులు అప్పగించడం వల్ల స్వయం సహాయక గ్రూపులకు ఆదాయం పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పేదరిక నిర్మూలన కూడా అమృత్ మిత్ర పథకం ప్రధాన లక్ష్యమని, అది కూడా నెరవేరుతుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్దయాళ్అంత్యోదయ యోజన– నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్స్ మిషన్(డీఏవైఎన్యుఎల్ఎం) స్కీం కింద ఆయా సంస్థలకు నిధులు అందుతాయని అధికారులు తెలిపారు.