ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోయిస్టుల హతం

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోయిస్టుల హతం

ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లాలో ఈ తెల్లవారుజాము ఎన్ కౌంటర్ జరిగింది. గోండెరాస్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా.. ఉదయం ఐదు గంటల సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఫైరింగ్ చేశారు. అలర్ట్ అయిన మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ మహిళా కమెండోలు కూడా పాల్గొన్నారని దంతెవాడ ఎస్పీ తెలిపారు. వుమెన్ DRG ప్లాటూన్ లో మావోయిస్టు మాజీ సానుభూతిపరులు, మాజీ మావోయిస్టు కుటుంబ సభ్యుల్ని రిక్రూట్ చేసుకున్నారు.