పుర్రెపై ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం వార్నింగ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..?

పుర్రెపై ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం వార్నింగ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..?

మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా.. మరో వరల్డ్ వార్ మొదలైందా.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే మాట్లాడుకుంటుంది. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ తోపాటు అమెరికా కూడా దాడులు చేస్తుండటం వణుకుపుట్టిస్తుంది. ఓ వైపు ఇజ్రాయెల్ మరో వైపు అమెరికా దాడులపై ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఓ వైపు ఇరాన్ లోని టెహ్రాన్ సిటీ నాశనం అవుతున్నా.. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. 

ఇజ్రాయెల్ దేశాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, రిలీజ్ చేసి పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇజ్రాయెల్ దేశానికి శిక్ష కొనసాగుతుంది.. మన శత్రువు చాలా పెద్ద తప్పు చేశాడు. అతి పెద్ద నేరం చేశాడు. దానికి శిక్ష తీవ్రంగా ఉంటుంది.. శిక్షించి తీరాలి కూడా.. అందుకే శిక్షిస్తున్నాం.. శిక్ష అనుభవిస్తారు కూడా అంటూ కామెంట్ చేయటం విశేషం.

ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్ వైఖరి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇరాన్ సుప్రీం స్పష్టంగా చెప్పటంతో.. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇంకా తీవ్రం అవుతుంది అని తేలిపోయింది. అమెరికా కూడా యుద్దంలోకి దిగటంతో.. పశ్చిమాసియా దేశాల్లోని ఐదు అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈ యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి సంపూర్ణంగా దిగినట్టే అంటున్నాయి పశ్చిమాసియా దేశాలు. 

మరో వైపు ఇరాన్ పై దాడుల విషయంలో చైనా, రష్యా, ఉత్తర కొరియా కూడా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితికి వ్యతిరేకంగా.. దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలను దాటి ఏకపక్షంగా అమెరికా దాడులు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి ఆయా దేశాలు. ఇరాన్ దేశానికి బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా.. అంతర్గతంగా.. లోపాయికారీగా చైనా, రష్యా, ఉత్తరకొరియా దేశాలు మద్దతు ఇవ్వొచ్చు అనే అభిప్రాయం పశ్చిమాసియా దేశాల్లో ఉంది. ఇదే జరిగితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి పునాదిగా చూడాలి. 

ఇరాన్ దేశంలోని ఐదు అణుస్థావరాలపై అమెరికా శక్తివంతమైన బాంబులు వేసిన తర్వాత.. యుద్ధంలోకి అమెరికా దిగిన తర్వాత.. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ చేసిన పోస్ట్, పోస్టర్ ఇప్పుడు యుద్ధం తీవ్రతను సూచిస్తుంది. ఇజ్రాయెల్ పై దాడులు ఇప్పట్లో ఆపేది లేదని.. శిక్ష కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించటం అనేది సంచలనంగా మారింది. యుద్ధం మరికొన్ని నెలులు కొనసాగుతుంది అని క్లారిటీ వచ్చేసింది.