IND vs ENG 4th Test: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. భారత జట్టులో కొత్త బౌలర్

IND vs ENG 4th Test: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. భారత జట్టులో కొత్త బౌలర్

భారత్, ఇంగ్లాండ్ మధ్య నేడు (ఫిబ్రవరి 23) నాలుగో టెస్టు జరుగుతుంది. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. పేస్ బౌలర్ బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. మరో వైపు ఇంగ్లాండ్ తన ప్లేయింగ్ 11 ను నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 5 టెస్టుల ఈ సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది.   

భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్