నేడు ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ రెండో టీ20

నేడు ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ రెండో టీ20

బ్రిస్టల్‌‌: తొలి మ్యాచ్‌‌లో బ్యాట్‌‌, బాల్‌‌తో పూర్తిగా ఫెయిలైన ఇండియా విమెన్స్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌ ఇంగ్లండ్‌‌తో మరో పోరుకు రెడీ అయింది. మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా  మంగళవారం రాత్రి జరిగే రెండో మ్యాచ్‌‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఈ పోరులో ఓడితే సిరీస్‌‌ కోల్పోయే ప్రమాదం ఉండటంతో హర్మన్‌‌ప్రీత్‌‌ కెప్టెన్సీలోని జట్టుపై ఒత్తిడి ఉంది.

తొలి పోరులో వికెట్లు చేతిలో ఉన్నా కూడా వేగంగా బ్యాటింగ్‌‌ చేయలేకపోయిన ఇండియా చిన్న స్కోరుకే పరిమితమైంది. బ్యాటింగ్‌‌లో చాలా బలంగా ఉన్న ఇంగ్లండ్‌‌ను ఓడించాలంటే కనీసం 160–170 స్కోరు అయినా చేయాలి. ఇక, చిన్న టార్గెట్‌‌ను కాపాడుకునే ప్రయత్నంలో తొలి మ్యాచ్​లో తేలిపోయిన బౌలర్లు కూడా పుంజుకుంటేనే ఇండియా   సిరీస్‌‌లో నిలుస్తుంది.