పారిస్ : ఇండియా షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మ,.. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–18, 21–18తో లక్ష్యసేన్పై నెగ్గాడు. మరో మ్యాచ్లో అన్సీడ్ సమీర్ 21–15, 21–23, 22–20తో ఆరోసీడ్ గింటింగ్ (ఇండోనేసియా)కు షాకిచ్చాడు. ప్రణయ్ 21–16, 16–21, 21–16తో లియూ డారెన్ (ఇండోనేసియా)ను ఓడించాడు.
