న్యూఢిల్లీ: మాజీ టీమిండియా ప్లేయర్ యశ్పాల్ శర్మ మృతి చెందాడు. గుండె నొప్పితో కన్నుమూసిన యశ్పాల్కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యశ్పాల్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్స్లో యశ్పాల్ 61 రన్స్తో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచ కప్లో ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా యశ్పాల్ నిలిచాడు. ఓవరాల్గా టీమిండియా తరపున 37 టెస్టుల్లో 1,606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. ఇందులో టెస్టుల్లో 2 సెంచరీలు ఉన్నాయి. యశ్పాల్ మృతిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. యశ్పాల్ మృతి తనను కలచి వేసిందని.. అంపైర్గా, జాతీయ సెలెక్టర్గా ఆయన అందించిన సేవలను మర్చిపోమని అనురాగ్ ట్వీట్ చేశారు.
Saddened by the passing away of ace cricketer & 1983 World Cup winning member Sh Yashpal Sharma.
— Anurag Thakur (@ianuragthakur) July 13, 2021
He had an illustrious career & was India's second-highest run getter at the 1983 World Cup. He was also an umpire and national selector. His contribution won’t be forgotten.
ॐ शांति pic.twitter.com/fhra6UcngV