ముంబై: 2018–2022 మధ్య కాలంలో దేశంలోని రైతుల ఆదాయం 1.3 నుంచి 1.7 రెట్లు దాకా పెరిగినట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. మహారాష్ట్రలోని సోయాబీన్ రైతులు, కర్నాటకలోని పత్తి రైతుల ఆదాయమైతే ఏకంగా రెట్టింపైనట్లు పేర్కొంది. వాణిజ్య పంటలు పండించే రైతుల ఆదాయాలు బాగా పెరిగినట్లు ఎస్బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ ఈ రిపోర్టులో చెప్పారు. దీంతో జీడీపీలో అగ్రికల్చర్ వాటా గతంలోని 14.2 శాతం నుంచి 18.8 శాతానికి పెరిగిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల తయారీ, సర్వీస్ సెక్టార్లు కొంత దెబ్బతిన్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.
బ్లాక్ పెప్పర్, కార్డమమ్, క్లోవ్, సినమన్, నేచురల్ రబ్బర్ వంటి వాటి ధరల తగ్గుదలపై ఈ రిపోర్టు ఏమీ మాట్లాడకపోవడం ఆసక్తికరమైన విషయం. రైతులకు ఫండ్స్ లభ్యత కోసం రూ.5 లక్షల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ఏర్పాటు చేయాలని, కనీసం 10 లక్షల మందికి లైవ్లీహుడ్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వానికి ఈ రిపోర్టు సూచించింది. కరోనా మహమ్మారి టైములో దేశ ఎకానమీని ఒక రకంగా వ్యవసాయ రంగమే ఆదుకుందని రిపోర్టు వివరించింది. 2022లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ 50 బిలియన్ డాలర్లను దాటాయని పేర్కొంది. మినిమం సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్పీ) ను పెంచడం కూడా ఈ రంగం ఎదుగుదలకు సాయపడుతోందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు వివరించింది.