
కౌలాలంపూర్: ఎఫ్ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో ఇండియా బోణీ చేసింది. అరైజిత్ సింగ్ హుందాల్ (11, 16, 41వ ని.) హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో మంగళవారం జరిగిన పూల్–సి తొలి మ్యాచ్లో ఇండియా 4–2తో కొరియాను ఓడించింది. ఇండియా తరఫున అరైజిత్ సింగ్తో పాటు అమన్దీప్ (30వ ని.) గోల్ సాధించాడు. డౌయున్ లిమ్ (38వ ని.), మింక్వోన్ కిమ్ (45వ ని.) కొరియాకు గోల్స్ అందించారు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్ ఫార్వర్డ్స్ ఫస్ట్ క్వార్టర్లోనే పెనాల్టీ కార్నర్తో గోల్ కొట్టారు. రెండో క్వార్టర్లోనూ అదే జోరు కొనసాగించిన ఇండియా హుందాల్, అమ్దీప్ ఫీల్డ్ గోల్స్తో ఆధిక్యాన్ని పెంచారు. ఫలితంగా హాఫ్ టైమ్కు ఇండియా 3–0 లీడ్లో నిలిచింది. సెకండ్ హాఫ్లో కాస్త పుంజుకున్న కొరియా ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టినా ప్రయోజనం దక్కలేదు. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్లో స్పెయిన్తో ఇండియా తలపడుతుంది.
షూటౌట్లో అమ్మాయిల గెలుపు
చిలీలో జరుగుతున్న జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ 9–12వ క్లాసిఫికేషన్ మ్యాచ్లో ఇండియా 3–2తో పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్ను ఓడించింది. నిర్ణీత టైమ్లో ఇరుజట్లు 3–3తో సమంగా నిలిచాయి. ఇండియా తరఫున రోప్ని కుమారి (8వ ని.), జ్యోతి చెత్రి (17వ ని.), సునెలితా టోప్పో (53వ ని.) గోల్స్ చేశారు.