న్యూఢిల్లీ: స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలను అడ్డుకోవడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు కలిసి పనిచేయాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పిలుపు ఇచ్చారు. ఒక విభాగం వద్ద ఉండే సమాచారాన్ని మరో విభాగం ఇచ్చి, పుచ్చుకుంటూ అక్రమ వ్యాపారాలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాల వెనక ఉండే మాస్టర్ మైండ్స్ను గుర్తించడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలు ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఎకానమీ, ప్రజలను దెబ్బతీసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆయా ఏజన్సీలు చెక్ చెప్పాలని అన్నారు.
స్మగ్లింగ్ లేదా అక్రమంగా ట్రేడింగ్సాగుతున్న వస్తువులు గత 50–60 ఏళ్లుగా మారలేదని, విలువైన మెటల్స్, నార్కోటిక్స్, విలువైన అటవీ రిజర్వులు, జల చరాలలోనూ అలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని నిర్మలా సీతారామన్ సోమవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నిర్వహించిన గ్లోబల్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. స్మగ్లింగ్ జరుగుతున్న వస్తువులు ఏవిటనేది మనకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చిందని, అలాంటి స్మగ్లింగ్ వెనక ఎవరున్నారనేది కూడా ప్రభుత్వ ఏజన్సీల వద్ద సమాచారం ఉండే ఉంటుందని అన్నారు.
లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ల సాయంతో స్మగ్లింగ్ వెనకాల ఉండే మాస్టర్ మైండ్స్ను కనుక్కునే ప్రయత్నాలను డరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూసీఓ) సాయంతో చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ సూచించారు. స్వాధీనం చేసుకున్న స్మగుల్డ్ వస్తువులను తిరిగి మార్కెట్లోకి రానీయకుండా, వాటిని పాడు చేస్తే అక్రమ వ్యాపారాలు తగ్గే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామనే భావన పౌరులలో నమ్మకాన్ని పెంచుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. బంగారం, సిగరెట్లు, నార్కోటిక్స్, యాంటిక్స్, వైల్డ్లైఫ్ మెటీరియల్స్ వంటివే స్మగుల్ అవుతున్నాయని అన్నారు.