- జియో ఫైబర్ నెట్ ఆఫర్
ముంబై : ఇండియన్ మూవీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు బిలీనియర్ ముఖేష్ అంబానీ వచ్చేస్తున్నారు. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఆఫర్ కింద జియోఫైబర్ నెట్వర్క్ ద్వారా వారానికి ఒక మూవీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ ప్రతేడాది 52 మూవీలను విడుదల చేయాలని, ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు లేదా మూడేళ్లలో దీన్ని సాధిస్తామని రిలయన్స్ చెబుతోంది.
‘మేము ఏడాదికి కనీసం 52 మూవీలను విడుదల చేయాలనుకుంటున్నాం. సొంత కథలను డెవలప్ చేసుకోవడానికి, మూవీ ప్రొడ్యుస్ చేసుకోవడానికి మూడు సోర్సస్ మా వద్ద ఉన్నాయి. ఇతర ప్రొడక్షన్ హౌజ్లతో కలిసి కో–ప్రొడ్యుస్ చేస్తాం. థర్డ్ పార్టీల నుంచి మూవీలను కొంటాం’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ల ప్రెసిడెంట్ జ్యోతి దేశ్పాండే తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కింద తొలుత నెలకు ఒకటి లేదా రెండు మూవీలు విడుదల చేస్తామని, ఆ తర్వాత దీన్ని వారానికి ఒకటికి పెంచుతామని తెలిపారు.