కోహ్లీ తాగే నీళ్లు లీటర్ కు రూ. 4 వేలు

కోహ్లీ తాగే నీళ్లు లీటర్ కు రూ. 4 వేలు

ఫిట్ నెస్ కి, ఆరోగ్యానికి టీమిండియా కెప్లెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఫిట్ నెస్ కోసం తన డైట్ ను కూడా మార్చుకున్నాడు. కేవలం తీసుకునే ఫుడ్ విషయంలోనే కాదు .. మంచినీటి విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే మినరల్ వాటర్ కి బదులు 'బ్లాక్ వాటర్' తీసుకుంటున్నాడు. ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. కరోనా ప్రారంభం నుంచి కోహ్లీ ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాడు. మినరల్ వాటర్ లీటర్ రూ. 20 నుంచి రూ. 40 వరకు ఉండగా... బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ఉంటుందట.

బ్లాక్ వాటర్ లో నేచురల్ ఆల్కలైన్ ఉంటుందట. ఆల్కలైన్ వ్యక్తి శరీరాన్ని ఫిట్ గా, హైడ్రేటెడ్ గా ఉంచుతుందట. దీంతో జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందట. మనం తాగే నీటిలో పీహెచ్ స్థాయి 7గా ఉంటే... బ్లాక్ వాటర్ లో 7 కంటే ఎక్కువ ఉంటుందట. ఈ వాటల్ లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయట. అంటే మన చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుందన్నమాట.