చచ్చిన బర్రెను ఎక్కిన ఆటో.. అదుపుతప్పి టిప్పర్‌‌ ఢీ: ఐదగురి మృతి

చచ్చిన బర్రెను ఎక్కిన ఆటో.. అదుపుతప్పి టిప్పర్‌‌ ఢీ: ఐదగురి మృతి

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో రోడ్డుపై చనిపోయిన బర్రెపైకి ఎక్కడంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం రోలుగుంపాడు సమీపంలో ప్యాసింజర్లతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో రోడ్డుపై చనిపోయిన గేదెపైకి ఎక్కింది. ఆ వేగంలో ఆటో పల్టీ కొట్టకుండా ఉండేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌‌ను డీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో పద్నాలుగు మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు.