హైదరాబాద్, వెలుగు: స్టైల్తత్వ పేరుతో ఈ నెల 22,23 తేదీల్లో లైఫ్స్టైల్, ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) ప్రకటించింది. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ దీనిని ప్రారంభిస్తారు. ఎంట్రీఫీజు రూ.వంద ఉంటుంది. మొత్తం 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ ఉంటుంది. 240 స్టాల్స్ను ఏర్పాటు చేస్తారు.
మొత్తం12 వేల మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్ బ్యాడ్జ్లు (పేపర్), లాన్యార్డ్లు (-కాటన్ రిబ్బన్, చేతితో తయారు చేసిన కాగితం), వాటర్ బాటిళ్లు (రీయూజబుల్), షాపింగ్ బ్యాగ్లు (కాటన్తో చేసిన రీయూజబుల్ కాన్వాస్ బ్యాగ్లు), చేతితో తయారు చేసిన కాగితం, అరటిపండుతో చేసిన పెన్సిళ్లను, పెన్నులను ప్రదర్శించారు.
ప్రముఖ బ్రాండ్ల, స్టార్టప్ల చేనేత వస్తువులు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని ఎఫ్ఎల్ఓ తెలిపింది.