ఈ నెల 22 నుంచి స్టైల్​ తత్వ

ఈ నెల 22 నుంచి స్టైల్​ తత్వ

హైదరాబాద్​, వెలుగు: స్టైల్​తత్వ పేరుతో ఈ నెల 22,23 తేదీల్లో లైఫ్​స్టైల్​, ఫ్యాషన్​ ఎగ్జిబిషన్​ నిర్వహిస్తున్నట్టు ఫిక్కీ లేడీస్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​ఎల్​ఓ) ప్రకటించింది. హైదరాబాద్​ మేయర్​ విజయలక్ష్మీ దీనిని ప్రారంభిస్తారు. ఎంట్రీఫీజు రూ.వంద ఉంటుంది. మొత్తం 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్​ ఉంటుంది. 240 స్టాల్స్​ను ఏర్పాటు చేస్తారు. 

మొత్తం12 వేల  మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.  ఈ సందర్భంగా ఎగ్జిబిటర్ బ్యాడ్జ్‌‌లు (పేపర్), లాన్యార్డ్‌‌లు (-కాటన్ రిబ్బన్,  చేతితో తయారు చేసిన కాగితం), వాటర్ బాటిళ్లు (రీయూజబుల్​), షాపింగ్ బ్యాగ్‌‌లు (కాటన్​తో చేసిన రీయూజబుల్ ​కాన్వాస్ బ్యాగ్‌‌లు),  చేతితో తయారు చేసిన కాగితం, అరటిపండుతో చేసిన పెన్సిళ్లను,  పెన్నులను ప్రదర్శించారు. 

ప్రముఖ బ్రాండ్ల, స్టార్టప్​ల చేనేత వస్తువులు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని ఎఫ్​ఎల్​ఓ తెలిపింది.