దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ మరోసారి రికార్డు

దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ మరోసారి రికార్డు

దేశంలోని అత్యంత వంద మంది ధనవంతుల జాబితాను ప్రకటించింది ఫోర్బ్స్. వరుసగా 13వసారి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో అత్యంత ధనవంతుడిగా మరోసారి రికార్డు సాధించారు. గతంలో 37.3 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద.. ఇప్పుడు 88.7 బిలియన్ డాలర్లకు చేరింది. తన సంపదలో 73 శాతం వృద్ధి సాధించారు అంబానీ. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు.

ఈ సారి అత్యంత ధనవంతుల జాబితాలో నలుగురు తెలుగు వారు చేరిపోయారు. 6.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో 20 వ స్థానంలో దివీస్ లాబోరేటరీస్ చీఫ్ మురళి, 3.25 బిలియన డాలర్లతో 43 వ స్థానంలో  డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీ, 3.1 బిలియన్ డాలర్లతో 45వ స్థానంలో  మెఘా ఇంజనీరింగ్  పీపీ రెడ్డి, కృష్ణారెడ్డి, 2.9 బిలియన డాలర్లతో అరబిందో రాంప్రసాద్ రెడ్డి ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించారు. కరోనా టైంలో వందమంది ధనవంతుల ఆదాయం 14 శాతం పెరిగిందని ఫోర్బ్స్ ప్రకటించింది.