
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడిన వారిని అటవీశాఖ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎఫ్డీవో చిన్న విశ్వనాథ్తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నిలేశ్, రోషన్ భోరజ్ మండలంలోని గిమ్మకు చెందిన రాథోడ్ సందీప్, జైనథ్కు చెందిన సంజీవ్ కలిసి మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో నాలుగు నెమళ్లు, ఒక జింకను వేటాడారు.
వాటిని భోరజ్లో అమ్ముతుండగా పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు నిలేశ్, రోషన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు నెమళ్ల కళేబరాలు, జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.