పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్  గౌడ్

ఆమనగల్లు, వెలుగు: పాత అలైన్​మెంట్​ ప్రకారమే ట్రిపుల్​ ఆర్​ నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్  గౌడ్  డిమాండ్  చేశారు. శుక్రవారం ఆమనగల్లులో మీడియాతో మాట్లాడుతూ రింగ్  రోడ్​ వంకర టింకరగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓఆర్ఆర్​ నిర్మాణంలో అలైన్​మెంట్లు మార్చడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

పాత అలైన్ మెంట్ తో 500 మంది రైతులు మాత్రమే భూములు కోల్పోతారని,  కొత్త అలైన్​మెంట్ తో 1,500 మంది రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైతే ఇన్నర్  రోడ్లను డెవలప్​ చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, జనార్దన్ రెడ్డి  పాల్గొన్నారు.