వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండి : మాజీ ఎంపీ రేణుకా చౌదరి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండి : మాజీ ఎంపీ రేణుకా చౌదరి

డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం లేదన్నారు మాజీ ఎంపీ రేణుకాచౌదరి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పావుల వడ్డీకి రుణాలు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే నోట్ల మార్పిడి చేయడం వల్ల డ్వాక్రా మహిళలు అనాడు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు.. మహిళా సంఘాల గ్రూపుల్లో జరిగే సమస్యల గురించి చర్చించారు. 

మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో మహిళా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ రేణుక చౌదరి, టీ పీసీసీ సీనియర్ అధికారి ప్రతినిధి కోఆర్డినేటర్ హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.