కంది మండలంలో పెట్రోల్ పోసి.. ఫ్రీగా సీడ్ బాల్స్ ఇస్తున్రు

కంది మండలంలో పెట్రోల్ పోసి..  ఫ్రీగా సీడ్ బాల్స్ ఇస్తున్రు

సంగారెడ్డి, వెలుగు : కంది మండలం కాశీపూర్ లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తున్న పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ పోయించుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఉచితంగా సీడ్ బాల్స్ (విత్తన బంతులు)  ఇస్తున్నారు. పూర్తిగా ఖైదీలతో నడుస్తున్న ఈ బంకులో ఇలా సీడ్ బాల్స్ అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీలతో 25 వేల సీడ్ బాల్స్ తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు సీడ్ బాల్స్ అందజేయడం పట్ల జైలు సూపరింటెండెంట్ కళాసాగర్  హర్షం వ్యక్తం చేశారు.