పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దాంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా.. డీజిల్ ధర రూ.92.82 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12పైసలకు చేరగా.. డీజిల్ ధర రూ.100.66కు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు 31 పైసలు, 38 పైసల చొప్పున పెరిగాయి. దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.33 పైసలకు చేరగా.. డీజిల్ ధర రూ.101.27 పైసలకు చేరింది. పెట్రో ధరల పెంపుతో సామాన్యులు ఆందోళనలో పడ్డారు. పెట్రోల్ ధరలు ఇలాగే పెరిగితే.. తాము వాహనాలు నడపడం కష్టమేనని వాపోతున్నారు.
For More News..
‘మా’ ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా?
స్కూల్కు వెళ్తున్న మైనర్ను ఎత్తుకెళ్లి గ్యాంగ్రేప్