హైదరాబాద్, వెలుగు: తొలి ఎడిషన్ తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టెన్పిన్ బౌలింగ్ టోర్నమెంట్లో గాంధీ కొఠారి, శ్రుతి అద్రి చాంపియన్లుగా నిలిచారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన మెన్స్ ఫైనల్లో రెండో సీడ్ గాంధీ కొఠారి 390–335 తేడాతో టాప్ సీడ్ ప్రేమ్ సాయిపై విజయం సాధించాడు. రక్షిత్ రాఘవ్ థర్డ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. అమ్మాయిల ఫైనల్లో రెండో సీడ్ శ్రుతి అద్రి 273–246తో టాప్ సీడ్ సింధురను ఓడించింది.

