పంట చేనులో గంజాయి సాగు ..95 మొక్కలు స్వాధీనం

పంట చేనులో గంజాయి సాగు ..95 మొక్కలు స్వాధీనం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా నార్నూర్  మండలం సుంగాపూర్ లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించి 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. సుంగాపూర్ కు చెందిన కొడప దేవరావును అరెస్ట్​  చేసి రూ. 9.5 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్  మహాజన్  తెలిపారు. గంజాయి పండించడం, అమ్మడం, సేవించడం నేరమని పేర్కొన్నారు. దాడుల్లో నార్నూర్  సీఐ ప్రభాకర్, సీసీఎస్  ఇన్స్​పెక్టర్  చంద్రశేఖర్, నార్నూర్  ఎస్సై కె అఖిల్  ఉన్నారు.