రన్నరప్ సాయి కార్తీక్‌‌‌‌‌‌‌‌ జోడీ

రన్నరప్ సాయి కార్తీక్‌‌‌‌‌‌‌‌ జోడీ

హైదరాబాద్, వెలుగు: వరల్డ్​ టూర్​ టెన్నిస్​ ఐటీఎఫ్​ ఫ్యూచర్స్​ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్​ ఆటగాడు గంటా సాయి కార్తీక్​ రెడ్డి మెన్స్​ డబుల్స్​లో రన్నరప్​గా నిలిచాడు. బెంగళూరులో శనివారం జరిగిన ఫైనల్లో సాయికార్తీక్–మనీశ్​ సురేశ్​కుమార్​ జోడీ 2–6, 5–7తో నాలుగో సీడ్ విష్ణు వర్దన్​–సిద్దాంత్ బాంటియా జోడీ చేతిలో ఓడిపోయింది.