
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ టూర్ టెన్నిస్ ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాడు గంటా సాయి కార్తీక్ రెడ్డి మెన్స్ డబుల్స్లో రన్నరప్గా నిలిచాడు. బెంగళూరులో శనివారం జరిగిన ఫైనల్లో సాయికార్తీక్–మనీశ్ సురేశ్కుమార్ జోడీ 2–6, 5–7తో నాలుగో సీడ్ విష్ణు వర్దన్–సిద్దాంత్ బాంటియా జోడీ చేతిలో ఓడిపోయింది.