
న్యూఢిల్లీ: మన దేశపు బిలియనీర్ గౌతమ్ అదానీ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ను వెనక్కి నెట్టి ఫోర్బ్స్ రియల్టైమ్ ర్యాంకింగ్లో 4 వ ప్లేస్కి చేరారు. తన సంపదలో 20 బిలియన్ డాలర్లను ఛారిటీకి (బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు) ఇస్తున్నట్లు బిల్గేట్స్ కిందటి వారంలో ప్రకటించారు. దీంతో ఆయన సంపద ఆ మేరకు తగ్గిపోయింది. ఫలితంగా ఫోర్బ్స్ లిస్ట్లో 5 వ ప్లేస్కి పరిమితమయ్యారు. బిల్గేట్స్ సంపద 102 బిలియన్ డాలర్లకు తగ్గగా, గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ సంపద 114 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఎలన్ మస్క్ 230 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ లిస్టులో టాప్ ప్లేసులో కొనసాగుతుండగా, లూయీస్ విటన్ ఓనర్ బెర్నార్డ్ అర్నాల్ట్ రెండో ప్లేస్లోనూ, అమెజాన్ జెఫ్ బెజోస్ మూడో ప్లేస్లోనూ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ 88 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్ల లిస్టులో 10 వ ప్లేస్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అంబానీని అదానీ దాటేశారు. అంతేకాదు, ప్రపంచంలోనే ఎక్కువ సంపద పోగేసుకున్న వ్యక్తిగానూ ఈ ఏడాదిలో అదానీ నిలిచారు. 2021 నుంచి చూస్తే గౌతమ్ అదానీ సంపద రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పేరొందిన అదానీ గ్రూప్, పవర్, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్, పోర్టులు వంటి రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్గా నిలవాలనే తన టార్గెట్కోసం 70 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.