గౌతమ్ అదానీ రియల్టీ సంపద 7 శాతం డౌన్ .. రూ.52,320 కోట్లకు తగ్గుదల

గౌతమ్ అదానీ రియల్టీ సంపద 7 శాతం డౌన్ .. రూ.52,320 కోట్లకు తగ్గుదల

ముంబై: రియల్టీ వ్యాపారం నుంచి గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది జూన్ నాటికి 7 శాతం తగ్గి రూ.52,320 కోట్లకు చేరుకుంది. ఈ రంగంలో మూడో అత్యంత సంపన్న బిలియనీర్‌‌గా నిలిచారని తాజా రిపోర్ట్​ వెల్లడించింది. ముంబై ధారావి,  మోతీలాల్ నగర్ పునరాభివృద్ధి వంటి ప్రాజెక్టులతో అత్యంత సంపన్న భారతీయులలో ఒకరిగా నిలిచిన అదానీ, రాబోయే ఐదు సంవత్సరాలలో అత్యంత సంపన్న రియల్టర్​గానూ ఎదుగుతారని హురున్ రీసెర్చ్  గ్రోహే రిపోర్ట్​ తెలిపింది.  

డీఎల్​ఎఫ్​కు చెందిన రాజీవ్ సింగ్ గ్రోహె- హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150 జాబితాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నెట్​వర్త్​ రూ. 1.27 లక్షల కోట్లు ఉంది.